ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- December 08, 2025
మస్కట్: ఒమన్ - ఇండియా మధ్య జరిగిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై షురా కౌన్సిల్ ఆర్థిక కమిటీ చర్చించింది. కౌన్సిల్ చైర్మన్ ఖలీద్ అల్ మావాలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రమోషన్ శాఖ మంత్రి ఖైస్ అల్ యూసఫ్ తోపాటు పలువురు ఆర్థిక రంగ నిపుణులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఒప్పందంలోని కీలక ఆర్థిక మరియు పెట్టుబడి క్లాజులపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ప్రతిపాదిత ఒప్పందంపై మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి కమిటీ సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి, ఉత్పాదక రంగాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి , వివిధ రంగాలలో పెట్టుబడులను ప్రారంభించడానికి భారత్ తో కుదిరిన ఒప్పందం అందించే అవకాశాలను వివరించారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించిన ఆర్థిక కమిటీ భారత్ తో ఒప్పందాన్ని ఆమోదించిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







