మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- December 08, 2025
న్యూజిలాండ్ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్ పై అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. సత్వీందర్ సింగ్ అనే వ్యక్తి గత 11 ఏళ్ల నుంచి న్యూజిలాండ్లో ఉంటున్నాడు.అతడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే 2023లో ఓ మైనర్ ప్రయాణికురాలు రాత్రిపూట అతడి క్యాబ్ను బుక్ చేసుకుంది.
సత్వీందర్ సింగ్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు.దారిలో వెళ్తుండగా జీపీఎస్ను ఆఫ్ చేశాడు. కారు రూట్ మార్చి వేరే చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి దగ్గర వదిలేశాడు. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలతో పరిశీలించారు. అనంతరం సత్వీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఈ కేసుపై అక్కడి కోర్టు విచారణ జరిపింది.సత్వీందర్ సింగ్ను దోషిగా తేల్చి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం
- సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన..షెడ్యూల్ ఇదే!
- స్క్రబ్ టైఫస్తో మూడుకు చేరిన మొత్తం మరణాల సంఖ్య
- ఇండిగో సంస్థ పై కేంద్రం చర్యలకు సిద్ధం
- వచ్చే యేడాది అందుబాటులోకి రానున్న విమాన కార్గో సేవలు
- మైనర్ బాలిక పై లైంగిక దాడి..భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!







