కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- December 09, 2025
యూఏఈ: యూఏఈలో పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ విధానాలను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆమోదించారు. పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడానికి ఆయన కొత్త డిజిటల్ రెసిలెన్స్ పాలసీని కూడా ఆమోదించారు. యూఏఈ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రిగా కూడా ఉన్న షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ వ్యూహాలకు ఆమోదముద్ర వేశారు.
మదీనాత్ లతీఫా మరియు అల్ యలాయిస్ అంతటా 152 పార్కులను కొత్తగా చేర్చాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ '20 నిమిషాల నగరం' భావనకు మద్దతు ఇస్తుంది. కమ్యూనిటీ పార్కులను సెంట్రల్ గ్రీన్ స్పేస్ల ఇంటర్కనెక్ట్ చేయబడిన నెట్వర్క్గా పరిచయం చేయనుంది.
మదీనాత్ లతీఫాలో, మోడల్ ప్రాంతంలోని 11 శాతం ప్రాంతాన్ని గ్రీనరిగా మార్చనున్నారు. 12 కిలోమీటర్ల లో వాకింగ్ మరియు సైక్లింగ్ మార్గాలను నిర్మించనున్నారు. అల్ యలాయిస్లో గ్రీన్ కారిడార్ను పరిచయం చేయనున్నారు. ఇందులో ఎంటర్ టైన్ మెంట్, సర్వీస్, వాణిజ్య సౌకర్యాలను అందిస్తుంది.
2023లో ప్రారంభించిన దుబాయ్ డిజిటల్ స్ట్రాటజీ లక్ష్యాలను నెరవేర్చడానికి దుబాయ్లో జీవితాన్ని డిజిటలైజ్ చేయడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళికలను ఎప్పటికప్పుడు రూపొందిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా షేక్ హమ్దాన్ స్పష్టం చేశారు.
కార్యనిర్వాహక మండలి 2025 ఎజెండా విజయాలను సమీక్షించింది. ఆర్థిక మరియు సామాజిక ఎజెండాలు, సహాయక ప్రణాళికల ద్వారా దుబాయ్ ప్లాన్ 2033 ప్రాధాన్యతలను అమలు చేయడంపై దృష్టి సారించే 2026 ప్రణాళికను ఆమోదించింది. ఇది సామాజిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు భద్రత, ప్రజా సేవలు వంటి రంగాలను కవర్ చేస్తుందని ప్రకటించారు.
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









