తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- December 09, 2025
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి వర్చువల్ గా సీఎం రేవంత్ విగ్రహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన విధంగా.. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఇదే నమూనాను అనుసరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలో 33 కలెక్టరేట్లలో ఒక్కో విగ్రహానికి రూ.17.50లక్షల చొప్పున మొత్తం రూ.5.8కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేయించింది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టరేట్లలో ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం ఎత్తు 18 అడుగులు కాగా.. అందులో విగ్రహం ఎత్తు 12 అడుగులు.. దిమ్మె ఆరు అడుగులు. తెలంగాణకు ప్రత్యేకమైన ఆకుపచ్చ చీరను పసుపు పచ్చ బంగారు అంచులతో అలంకరించి, తెలంగాణ సాంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్న మొక్కజొన్న, సజ్జ, గోధుమ పంటలను ఆమె ఎడమ చేతిలో అలంకారంగా ఉంచారు.
అలాగే నుదుటిపై ఎర్రటి బొట్టు, చెవులకు కమ్మలు, మెడలో సంప్రదాయ గుండుపూసల హారం, చేతులకు మట్టిగాజులు, కాళ్లకు కడియాలు, ముక్కు పుడక వంటి ఆభరణాలతో తెలంగాణ మహిళా స్వభావాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







