గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- December 13, 2025
మనామా: బహ్రెయిన్ లో గడువు ముగిసిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్న ఒక రెస్టారెంట్ యజమానికి క్రిమినల్ కోర్టు జైలుశిక్ష విధించారు. అలాగే, ఇంటి నుండి లైసెన్స్ లేకుండా కిచెన్ నడుపుతున్నందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD7,200 జరిమానా విధించారు.
గడువు ముగిసిన ఆహార పదార్థాలు మరియు ఆమోదించబడిన ప్రమాణాలకు అనుగుణంగా లేని వస్తువులను ఉపయోగించినందుకు రెస్టారెంట్ యజమానిని దోషిగా నిర్ధారించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. రెస్టారెంట్లోని ఒక ఉద్యోగి నుండి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపినట్టు వెల్లడించింది.
అధికారులు రెస్టారెంట్ ను తనిఖీ చేయగా, గడువు ముగిసిన ఫుడ్ ప్రొడక్ట్స్, బూజు పట్టిన ఆహారం, తెలియని కంపెనీలకు చెందిన వస్తువులు మరియు లైసెన్స్ లేకుండా ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!
- మస్కట్ మునిసిపాలిటీ చేతికి ఒమన్ బొటానిక్ గార్డెన్..!!
- షేక్ తమీమ్ అవార్డుల విజేతలను సత్కరించిన అమీర్..!!
- 14 రోజుల్లో 21 ఆస్తులకు విద్యుత్ నిలిపివేత..!!
- యూఏఈలో తొలి లైసెన్స్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్..!!
- ప్రారంభమైన హెచ్ 1బీ, సోషల్ మీడియా స్క్రీనింగ్..







