సైనికాధికారిని చంపినందుకు ఇద్దరికి మరణశిక్ష విధించిన సౌదీ కోర్టు
- July 27, 2016
దుబాయ్: 2007లో సౌదీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సైనికాధికారిని చంపినందుకు సౌదీ కోర్టు ఇద్దరికి మరణశిక్ష విధించింది. హంతకులు ఇరువురు అల్ఖైదా అనుచరులని ఆరోపణలు ఉన్నాయని స్థానిక మీడియా మంగళవారం తెలిపింది. ఉత్తర సౌదీ అరేబియా లో బురైదహ్ నగరానికి సమీపంలో తన వ్యవసాయ క్షేత్రంలో కల్నల్ నాజర్ అల్ ఉథ్మాన్ పై దాడి చేసిన హంతకులు ఇరువురు ఆయనను కట్టివేసి వెబ్సైట్ సబక్ .ఓ ఆర్ జి ఆన్ లైన్ కోర్టు సైనికాధికారి పట్ల మత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నాడని వెలువడిన తీర్పు కారణంగా ఆయన తలను శరీరం నుండి వేరు చేసినట్లు పేర్కొన్నారు2003 మరియు 2006 ల మధ్య కాలంలో పాశ్చాత్య మరియు సౌదీ దేశాలలో తమ భావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై అల్ఖైదా దాడులు నిర్వహించి వందలాది మందిని పొట్టనబెట్టుకొంది. ఆ సమయంలో సౌదీ అరేబియా తీవ్రవాదం విప్లవంతో సంబంధం ఉన్నవారిని దోషులుగా గుర్తించి జైలుశిక్ష విధించింది. ఈ ఏడాది జనవరి 2 వ తేదీన డజను మందికి మరణశిక్ష అమలు జరిపేరు. మంగళవారం ఇచ్చిన తీర్పులో, మూడవ వ్యక్తికి 30 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది, సౌదీ అరేబియా యొక్క ఉత్తర ఖ్అస్సిమ్ ప్రాంతంలో అత్యవసర దళాల కమాండర్ చంపడానికి ప్రయత్నించిన కేసులో ఆ వ్యక్తి పాత్ర ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







