సిరియాలో ఒకేరోజు రెండు చోట్ల బాంబు పేలుళ్లు
- July 27, 2016
సిరియాలో ఒకేరోజు రెండు వేరు వేరు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 44 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. బుధవారం టర్కీ సరిహద్దుల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. పర్యవేక్షక బృందం తెలిపిన వివరాల ప్రకారం.. కామిష్లిలోని హసాకా పరిధిలో గల కుర్దిష్ పరిపాలన విభాగంలో భద్రతా కార్యాలయ సమీపంలో ఓ కారు బాంబు పేలింది. కొద్ది నిమిషాల తర్వాత నుసేబిన్లో ఓ ద్విచక్రవాహనంలో అమర్చిన బాంబు పేలడంతో రెండు చోట్ల కలిపి దాదాపు 44 మంది చనిపోగా మరి కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా.. ఈ పేలుళ్లకు ఐఎస్ ఉగ్రవాదులు బాధ్యత వహించినట్లు తెలిపింది. కుర్దిష్ వైపీజే సేన, దాని మిత్రపక్షాలైన హుసాకా, అలెప్పోల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







