E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- December 24, 2025
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) పై ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఆ ప్రమాదానికి డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణమని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ కారణంగా వాహనం అదుపుతప్పి కాంక్రీట్ బారియర్ను ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారు గాయాలతో బయటపడ్డారని దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూ అలెర్ట్ జారీ చేశారు. బాగా అలసిపోయినప్పుడు, మగతగా ఉన్నప్పుడు లేదా తక్కువ లేదా అధిక బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని, లేదంటే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
అయితే, కొందరు డ్రైవర్లు ఇవి చిన్న లక్షణాలే అనుకుంటారని, కానీ డ్రైవర్ కొన్ని సెకన్లలో పూర్తి నియంత్రణను కోల్పోవచ్చని, ఇది వారి జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు. స్పృహ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన కారణాలలో ఒకటి అని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..







