E311లో ప్రమాదం.. డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణం..!!
- December 24, 2025
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ (E311) పై ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే, ఆ ప్రమాదానికి డ్రైవర్ స్పృహ కోల్పోవడమే కారణమని దుబాయ్ పోలీసులు తెలిపారు. ఈ కారణంగా వాహనం అదుపుతప్పి కాంక్రీట్ బారియర్ను ఢీకొట్టిందని వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారు గాయాలతో బయటపడ్డారని దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో దుబాయ్ పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తూ అలెర్ట్ జారీ చేశారు. బాగా అలసిపోయినప్పుడు, మగతగా ఉన్నప్పుడు లేదా తక్కువ లేదా అధిక బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, మానసిక రుగ్మతలు లేదా ఆకస్మిక స్పృహ కోల్పోవడం వంటి ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడు డ్రైవింగ్ కు దూరంగా ఉండాలని, లేదంటే తీవ్రమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
అయితే, కొందరు డ్రైవర్లు ఇవి చిన్న లక్షణాలే అనుకుంటారని, కానీ డ్రైవర్ కొన్ని సెకన్లలో పూర్తి నియంత్రణను కోల్పోవచ్చని, ఇది వారి జీవితాన్ని మరియు ఇతరుల జీవితాలను ప్రమాదంలో పడేస్తుందని బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ తెలిపారు. స్పృహ కోల్పోవడం అత్యంత ప్రమాదకరమైన కారణాలలో ఒకటి అని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









