అమెజాన్ లో 850 మందికి జాబ్స్!
- December 25, 2025
అమెరికా: విశాఖపట్నంలో అమెజాన్ తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది.పెందుర్తి వద్ద రెండేళ్ల క్రితం డెవలప్మెంట్ సెంటర్ను ఆ సంస్థ ప్రారంభించింది. వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త విస్తరణ ప్రణాళికలు, విశాఖపట్నం టెక్నాలజీ హబ్గా మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడతాయని ఆశిస్తున్నారు. అమెజాన్ విశాఖలో తన కార్యకలాపాలను గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం 300 మంది ఉద్యోగులతో పనిచేస్తున్న ఈ సంస్థ, రాబోయే మూడేళ్లలో మరో 533 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. దీని ద్వారా మొత్తం ఉద్యోగుల సంఖ్య 833కి చేరుతుంది. ఈ విస్తరణకు అవసరమైన పెట్టుబడిని కూడా రెట్టింపు చేయాలని అమెజాన్ యోచిస్తోంది.ఈ-కామర్స్ రంగంలో తమ ఎగుమతులను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో అమెజాన్ ముందుకు సాగుతోంది.
రాబోయే కాలంలో రూ.100 కోట్ల మేర ఈ-కామర్స్ ఎగుమతులను పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతమిస్తుందని భావిస్తున్నారు. అమెజాన్ తన విస్తరణ ప్రణాళికల్లో భాగంగా, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI)లో తమ సంస్థను రీ-రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు దాన్ని విస్తరించి 850 మందిని నియమించుకోనుందని IT వర్గాలు తెలిపాయి. మూడేళ్లలో ₹9,740 కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పాయి.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







