అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం
- December 29, 2025
ఇండోనేసియా: ప్రపంచదేశాలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నాయి. బంధువులు, స్నేహితులు, కుటుంబసభ్యులు ఆనందంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించేందుకు పలు కార్యక్రమాలకు సిద్ధపడుతున్నారు. ఆనంద కేరింతల్లో తేలియాడేందుకు ఎదురుచూస్తున్నారు. కానీ ఇండోనేసియాలోని ఓ ద్వీపవాసులు మాత్రం విషాదంలో మునిగిపోయింది. మరో మూడురోజుల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశిస్తున్న ఆనందానికి దూరంగా మంటలకు దగ్ధమైపోయారు.
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలోని మనాడో నగరంలో వెర్థాదమై రిటైర్మెంట్ హోమ్ లో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 16మంది వృద్ధులు సజీవ దహనమయ్యారు. మరో 12 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 16మంది వృద్ధులు సజీవ దహనం కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రభుత్వాధికారులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







