శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- December 29, 2025
తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి గోవింద నామస్మరణతో భక్తితో తిరుమలకు నడచుకుని వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అలిపిరి నడకమార్గంలో ఏడోమైలు వద్ద ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని టిటిడి (TTD) ఏర్పాటు చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని ఆదివారం ఉదయం టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు, టిటిడి ఇఒ అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి ప్రారంభించారు. నడకదారి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ ప్రాధమిక చికిత్సా కేంద్రం నెలకొల్పడంతో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ప్రాథమిక చికిత్సా కేంద్రం భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతిరోజూ ఈ మార్గంలో 30వేల వరకు భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు.వారికి ఏదేని అనారోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్యసహాయం పొందవచ్చని చౌదరి చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, టిటిడి సిఎంఒ డాక్టర్ బి.కుసుమకుమారి, మెడికల్ అధికారిణి డాక్టర్ ఎస్.కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







