‘శంబాల’ సినిమా విజయం పై స్పందించిన ప్రభాస్
- December 29, 2025
‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తోటి నటుల విజయాలను గుర్తించి అభినందించడం ప్రభాస్ కు కొత్త కాదు. ఈసారి కూడా అదే చేశారు. టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా విజయం సాధించడంపై ప్రభాస్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా “ఆది అండ్ టీమ్కు కంగ్రాట్యులేషన్స్.. ‘శంబాల’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది” అంటూ ప్రశంసలు కురిపిస్తూ మూవీ పోస్టర్ను షేర్ చేశారు.
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన ‘శంబాల’ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా నిలకడగా వసూళ్లు రాబడుతోంది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







