‘శంబాల’ సినిమా విజయం పై స్పందించిన ప్రభాస్
- December 29, 2025
‘ది రాజాసాబ్’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా, తాజాగా ప్రభాస్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
తన సినిమాల పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తోటి నటుల విజయాలను గుర్తించి అభినందించడం ప్రభాస్ కు కొత్త కాదు. ఈసారి కూడా అదే చేశారు. టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’ సినిమా విజయం సాధించడంపై ప్రభాస్ స్పందించారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా “ఆది అండ్ టీమ్కు కంగ్రాట్యులేషన్స్.. ‘శంబాల’ సినిమా అద్భుతమైన విజయం సాధించింది” అంటూ ప్రశంసలు కురిపిస్తూ మూవీ పోస్టర్ను షేర్ చేశారు.
ఆది సాయికుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన ‘శంబాల’ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కూడా నిలకడగా వసూళ్లు రాబడుతోంది.
తాజా వార్తలు
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?
- వరల్డ్ ర్యాపిడ్ చెస్లో మెరిసిన తెలుగు తేజాలు..
- అందుకే కేసీఆర్కు షేక్హ్యాండ్ ఇచ్చాను: సీఎం రేవంత్
- శ్రీవారి మెట్ల మార్గంలో ప్రాథమిక చికిత్స కేంద్రం
- అగ్ని ప్రమాదంలో 16 మంది వృద్ధులు సజీవ దహనం







