ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- December 29, 2025
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించటం జరిగింది.ఆయనను ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించడం జరిగింది.ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికత పొందింది.
రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ప్రభుత్వం తీసుకునే ఆరోగ్య, సహజ చికిత్సా విధానాలపై సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిపాలన, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ఆయన ముఖ్య బాధ్యతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రకృతి వైద్యానికి సంబంధించిన కొత్త పథకాలు, ప్రాజెక్టులు మరియు విధానాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర వహిస్తారని, ప్రభుత్వ శాఖలు అందించే సూచనలు, మార్గదర్శకాలతో రాష్ట్రంలో ఆరోగ్య పరిపాలన మరింత సమర్థవంతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









