ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- December 29, 2025
అమరావతి: ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును నియమించటం జరిగింది.ఆయనను ముఖ్యంగా ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా నియమించడం జరిగింది.ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారికత పొందింది.
రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉన్న డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు, ప్రభుత్వం తీసుకునే ఆరోగ్య, సహజ చికిత్సా విధానాలపై సలహాలు, మార్గదర్శకత్వం అందిస్తారు. రాష్ట్రంలో ప్రజారోగ్య పరిపాలన, ప్రత్యామ్నాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం ఆయన ముఖ్య బాధ్యతగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రకృతి వైద్యానికి సంబంధించిన కొత్త పథకాలు, ప్రాజెక్టులు మరియు విధానాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర వహిస్తారని, ప్రభుత్వ శాఖలు అందించే సూచనలు, మార్గదర్శకాలతో రాష్ట్రంలో ఆరోగ్య పరిపాలన మరింత సమర్థవంతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు....
- ఇక పై మీ ఇమెయిల్ అడ్రస్ను మార్చుకోవచ్చు!
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మంతెన సత్యనారాయణ
- కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- అల్ సుడాన్ బస్ స్టేషన్లో రవాణా సేవలు అప్డేట్..!!
- ఒమన్ లో ఘోర ప్రమాదం..నలుగురు మృతి..!!
- గొడవలో కత్తిపోట్లకు గురై వ్యక్తి మృతి..!!
- కువైట్లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్..!!
- సౌదీ అరేబియాను తాకిన కోల్డ్ వేవ్స్..!!
- ఫాస్ట్ డిజిటల్ రుణాల వల్ల రిస్క్ ఉందా?







