కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- December 29, 2025
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఆసక్తి నెలకొన్నప్పటికీ, ఆయన సభలో కేవలం కొన్ని నిమిషాలే ఉండి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశంతో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ఆయన విమర్శించారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం వెనుక ప్రజల సమస్యలు కాకుండా, ఎమ్మెల్యే హోదా కొనసాగించుకోవడమే ప్రధాన ఉద్దేశమని బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా జీతం పొందడానికే ఆయన సభకు వచ్చారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని పెద్దగా హైప్ చేశారని, కానీ వాస్తవంగా ఆయన రెండు నిమిషాలు కూడా సభలో ఉండలేదని తెలిపారు. సభలో దళిత స్పీకర్ను “అధ్యక్షా” అని సంబోధించాల్సి వస్తుందన్న అసహనం, దళితుల సమస్యలపై చర్చించాల్సి వస్తుందన్న కారణాలతోనే కేసీఆర్ వెళ్లిపోయారని ఐలయ్య విమర్శించారు. దళితుల పట్ల ఆయనకు నిజమైన గౌరవం లేదన్న విషయం ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









