కొన్ని నిమిషాలు మాత్రమే అసెంబ్లీ లో ఉన్న కేసీఆర్
- December 29, 2025
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీనిపై ఆసక్తి నెలకొన్నప్పటికీ, ఆయన సభలో కేవలం కొన్ని నిమిషాలే ఉండి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశంతో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని ఆయన విమర్శించారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావడం వెనుక ప్రజల సమస్యలు కాకుండా, ఎమ్మెల్యే హోదా కొనసాగించుకోవడమే ప్రధాన ఉద్దేశమని బీర్ల ఐలయ్య ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా జీతం పొందడానికే ఆయన సభకు వచ్చారని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ అసెంబ్లీకి రావడాన్ని పెద్దగా హైప్ చేశారని, కానీ వాస్తవంగా ఆయన రెండు నిమిషాలు కూడా సభలో ఉండలేదని తెలిపారు. సభలో దళిత స్పీకర్ను “అధ్యక్షా” అని సంబోధించాల్సి వస్తుందన్న అసహనం, దళితుల సమస్యలపై చర్చించాల్సి వస్తుందన్న కారణాలతోనే కేసీఆర్ వెళ్లిపోయారని ఐలయ్య విమర్శించారు. దళితుల పట్ల ఆయనకు నిజమైన గౌరవం లేదన్న విషయం ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







