శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- December 30, 2025
తిరుమల: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. టీటీడీలో గత అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు వైకుంఠ ద్వార తలుపులు తెరిచారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా నిన్న ఒక్కరోజే దాదాపు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం 3 గంటల పాటు మాత్రమే ఉంటాయన్నారు.
మూడు రోజుల దర్శనాల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా దాదాపు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు చెప్పారు. టీటీడీ రెండంచెల తనిఖీనీ పాటిస్తోంది. నిన్న 18,609 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు.
కాగా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.
వేములవాడ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ద్వారక తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీపాల కాంతుల్లో భద్రాచలం దేవాలయం వెలిగిపోతోంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









