పురావస్తు శాస్త్రవేత్త పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి
- July 27, 2016
పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు పీవీ పరబ్రహ్మశాస్త్రి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు. ఎన్నో చరిత్రలను బయటకు తీసి వందలాది శాసనాలను ప్రకటించిన గొప్ప చరిత్రకారునిగా పరబ్రహ్మశాస్త్రి నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. శాతవాహనులు, కాకతీయుల పాలనా విశేషాలు ప్రపంచానికి చాటి చరిత్రకు మేలు చేశారని సీఎం కొనియాడారు. పరబ్రహ్మశాస్త్రి పరమపదించడం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శాత వాహనుల వంశ చరిత్రపై పరిశోధనలు చేసి తెలుగువారని రుజువు చేసిన చరిత్రకారుడు పరబ్రహ్మ శాస్త్రి అని గుర్తు చేశారు. ఆయన మృతి తెలగు భాషకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటని బాలకృష్ణ అన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









