ఖతార్ లో 80% తగ్గిన స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు..!!
- January 04, 2026
దోహా: ఖతార్ లో స్కూల్స్ లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులు 80శాతం తగ్గనున్నాయి. ఇందు కోసం ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్ల కోసం అధునాతన లైసెన్సింగ్ వ్యవస్థను అమలు చేయనున్నారు. ముఖ్యంగా మునుపటి వ్యవస్థతో పోలిస్తే లైసెన్స్ పునరుద్ధరణ ఖర్చులలో దాదాపు 80% తగ్గుతుందని విద్యామంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో విద్య మరియు ఉన్నత విద్యా మంత్రి హెచ్ ఇ లోల్వా బింట్ రషీద్ అల్ ఖాటర్ స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్లు ఇప్పుడు ఏటా కాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి తమ లైసెన్స్లను పునరుద్ధరిస్తాయని తెలిపారు. దీంతోపాటు మంత్రిత్వ శాఖ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న విశిష్ట పాఠశాలలకు ఐదు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే అధునాతన విద్యా లైసెన్స్ మంజూరు చేయబడుతుందన్నారు.
ఈ వ్యవస్థ ప్రైవేట్ విద్యా సంస్థల లైసెన్సింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పనిచేస్తుందని, ఇది అన్ని లైసెన్సింగ్ విధానాలను ఒకే డిజిటల్ ఇంటర్ఫేస్లో స్మార్ట్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







