NATS బోర్డు ఛైర్మన్గా కిషోర్ కంచర్ల
- January 04, 2026
అమెరికా: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్కి ఛైర్మన్గా కిషోర్ కంచర్ల కు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, గుడివాడ సమీపంలోని రిమ్మనపూడి గ్రామానికి చెందిన కిషోర్ కంచర్ల అటు వ్యాపారం.. ఇటు సేవా రంగంలోనూ దూసుకుపోతున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగిగా అడుగుపెట్టిన కిషోర్ కంచర్ల ఆ తరువాత బావర్చి పేరుతో రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. అనతి కాలంలోనే బావర్చి బ్రాండ్లను అమెరికా అంతటా విస్తరించారు. అటు వ్యాపారంతో పాటు ఇటు సేవా రంగంలో కూడా కిషోర్ కంచర్ల తన సత్తా చాటుతున్నారు. నాట్స్తో సుదీర్ఘ అనుబంధం ఉన్న కిషోర్ కంచర్ల ను 2026-27 సంవత్సరాలకు నాట్స్ బోర్డు చైర్మన్ పదవి వరించింది. అలాగే ఇప్పటివరకు చైర్మన్గా ఉన్న ప్రశాంత్ పిన్నమనేనికి నాట్స్ బోర్డు ఘనంగా వీడ్కోలు పలికింది. నాట్స్ 2.0 ద్వారా కీలక సంస్కరణలు చేపట్టడం.. అమెరికాలో తెలుగువారికి నాట్స్ను మరింత చేరువ చేయడం..నాట్స్ ప్రతిష్టను పెంచడం.. వంటి అంశాల్లో ప్రశాంత్ చూపిన చొరవను నాట్స్ బోర్డు ప్రత్యేకంగా అభినందించింది.
తాజా వార్తలు
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- సైనిక స్థావరాల్లో రక్షణ మంత్రి తనిఖీలు.. సైన్యం సన్నద్ధతపై సమీక్ష..
- దుబాయ్లో కొత్త అల్ ఖుద్రా బ్రిడ్జి ప్రారంభం..
- బోనాల ఉత్సవాల్లో AI కెమెరాలతో అప్రమత్తమైన నిఘా:సీపీ సజ్జనార్
- రియాద్లో మృత్యువుతో పోరాడుతున్న ఏపీ వాసి.. లక్ష్మీనారాయణకు తెలుగు సంఘాల అండ
- వైజాగ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్..







