ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!

- January 07, 2026 , by Maagulf
ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!

జకార్తాః  ఇండోనేషియాలోని పశ్చిమ జావా, సుకబుమిలోని పెలాబుహన్‌రతులోని బుబాలు బీచ్‌లో జెట్ స్కీ బోల్తా పడటంతో 39 ఏళ్ల సౌదీ పౌరుడు మరణించాడని ఇండోనేషియా తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు జకార్తాలోని సౌదీ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ సౌదీ పౌరుడు, ఒక ఇండోనేషియా మహిళ తీరప్రాంత పర్యాటక కేంద్రంలో ఒడ్డుకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా వారు ప్రయాణిస్తున్న జెట్ స్కీ బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఆ ఇండోనేషియా మహిళ పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాబుహన్‌రతు పోలీసులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com