ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- January 07, 2026
జకార్తాః ఇండోనేషియాలోని పశ్చిమ జావా, సుకబుమిలోని పెలాబుహన్రతులోని బుబాలు బీచ్లో జెట్ స్కీ బోల్తా పడటంతో 39 ఏళ్ల సౌదీ పౌరుడు మరణించాడని ఇండోనేషియా తెలిపింది. మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు జకార్తాలోని సౌదీ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఆ సౌదీ పౌరుడు, ఒక ఇండోనేషియా మహిళ తీరప్రాంత పర్యాటక కేంద్రంలో ఒడ్డుకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తుండగా వారు ప్రయాణిస్తున్న జెట్ స్కీ బోల్తా పడింది. తీవ్ర గాయాలపాలైన ఆ ఇండోనేషియా మహిళ పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పలాబుహన్రతు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!
- సౌదీ అరేబియాలో పబ్లిక్ హెల్త్.. 2030 టార్గెట్ ముందుగానే రీచ్..!!
- ఖరీఫ్ ప్రారంభం..విజిటర్స్ కు ధోఫార్ స్వాగతం..!!
- ఖతార్ లో 'ఆపిల్ పే' ద్వారా ATM నుండి విత్ డ్రా..!!
- కొత్తగా ప్రాభించిన ఫ్లైఓవర్ పై భద్రతా పరమైన హెచ్చరికలు..!!
- రెడ్ సిగ్నల్ ఉల్లంఘనలపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక..
- ఫిక్స్డ్ అడ్మిషన్ పీరియడ్’తో మారనున్న వీసా రూల్స్..
- ప్రతి పోలీసు అధికారి యోగాను దినచర్యలో భాగం చేసుకోవాలి: సైబరాబాద్ సీపీ







