సిరియాలో ఐసిస్ రెండు కారు బాంబులు పేల్చారు
- July 28, 2016
సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఖ్వాంష్లీలో రెండు కారు బాంబులు పేల్చారు. ఈ ఘటనలో 50మంది మృతి చెందారు. సిరియాలో కుర్దులను టార్గెట్ చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. కుర్దులు ఎక్కువగా ఉండే ఖ్వాంష్లీ పట్టణంలో కారు బాంబులతో విధ్వంసం సృష్టించారు. ఖ్వాంష్లీ మార్కెట్ ఏరియాలో మొదట ఓ కారు బాంబు పేలింది. ఈ పేలుడు జరిగిన పది నిమిషాల్లో మరో కారు బాంబు పేల్చారు ఐసిస్ ఉగ్రవాదులు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందమందకిపైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సరిహద్దులో ఉన్న ఈ పట్టణంలో నెలరోజుల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు కారుబాంబు పేల్చి 20మందిని బలిగొన్నారు. తాజాగా మరోసారి దాడి చేయడంతో సరిహద్దులను సిరియా ప్రభుత్వం మూసివేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









