డ్రైవింగ్లో మొబైల్ ఫోన్ వాడకంపై హెచ్చరిక
- July 28, 2016
డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవు. అక్కడికక్కడే వారిని బుక్ చేసేందుకు ట్రాఫిక్ పెట్రోల్స్, సెక్యూరిటీ పర్సనల్ సంసిద్ధంగా ఉన్నారని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. ట్విట్టర్ ద్వారా మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం పట్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తున్న మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని విజ్ఞప్తి చేసింది. మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాల్ని నడపడం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందనీ, ప్రమాదాలకు కారణమవుతుందనీ, ఆ ప్రమాదాల్లో ఇతరులు కూడా చనిపోయే అవకాశం ఉన్నందున ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నామని మినిస్ట్రీ పేర్కొంది. మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసేవారి విషయంలో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపడ్తున్నామనీ, అలాగే దీన్ని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు సలహాలు అందించవలసిందిగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కోరింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







