మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!

- January 18, 2026 , by Maagulf
మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!

మలేసియాకు చెందిన విమానాలు మిస్సవ్వడం కొత్త విషయం కాకపోయినా, మరోసారి ఇలాంటి ఘటన జరగడం కలకలం రేపుతోంది. 11 మంది ప్రయాణిస్తున్న ఇండోనేషియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన ATR 42-500 విమానం మంగళవారం ఇండోనేషియాలోని జావా, సులవేసి ద్వీపాల మధ్య ఉన్న పర్వత ప్రాంతాల్లో కనిపించకుండా పోయింది.

దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని మారోస్ జిల్లా సమీపంలో మధ్యాహ్నం 1:17 గంటల సమయంలో ఈ విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో చివరిసారిగా సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని వెల్లడించారు. విమానం సుల్తాన్ హసనుద్దీన్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com