ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- January 18, 2026
మనామా: బహ్రెయిన్ లో దారి దోపిడీ సంఘటన నమోదైంది. ఒక టాక్సీ డ్రైవర్ను రోడ్డుపై ఆపిన ఒక వ్యక్తి.. బలవంతంగా వాహనంలోకి ప్రవేశించి, డ్రైవర్ ను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, BD220 నగదు తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదులో కేసు నమోదైంది. ఈ కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది.
నిందితుడు రాయితో కొట్టడంతో డ్రైవర్ తలకు బలమైన గాయం ఏర్పడిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియో క్లిప్ ను సమర్పించారు. ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపింది. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఫిబ్రవరి 24న తుదితీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసింది.
తాజా వార్తలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!









