ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- January 18, 2026
మనామా: బహ్రెయిన్ లో దారి దోపిడీ సంఘటన నమోదైంది. ఒక టాక్సీ డ్రైవర్ను రోడ్డుపై ఆపిన ఒక వ్యక్తి.. బలవంతంగా వాహనంలోకి ప్రవేశించి, డ్రైవర్ ను రాయితో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, BD220 నగదు తీసుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదులో కేసు నమోదైంది. ఈ కేసును హై క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది.
నిందితుడు రాయితో కొట్టడంతో డ్రైవర్ తలకు బలమైన గాయం ఏర్పడిందని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ మేరకు దాడికి సంబంధించిన వీడియో క్లిప్ ను సమర్పించారు. ప్రాసిక్యూషన్ ఆ వ్యక్తిపై దొంగతనం అభియోగం మోపింది. కాగా, ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు..ఫిబ్రవరి 24న తుదితీర్పు ప్రకటిస్తామని వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









