నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- January 18, 2026
నిజ్వా: నిజ్వా విలాయత్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా అనేక షాపులకు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్కు చెందిన పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను కష్టపడి అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!









