నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- January 18, 2026
నిజ్వా: నిజ్వా విలాయత్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా అనేక షాపులకు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్కు చెందిన పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను కష్టపడి అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









