నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- January 18, 2026
నిజ్వా: నిజ్వా విలాయత్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య భవనంలో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా అనేక షాపులకు వ్యాపించాయి. ఎగసిపడుతున్న మంటలను చూసి ప్రజలు భయంతో పరుగులు పెట్టారు.
అగ్ని ప్రమాదం సమాచారం అందగానే అల్ దఖిలియా గవర్నరేట్కు చెందిన పౌర రక్షణ మరియు అంబులెన్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. మంటలను కష్టపడి అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







