భరణి దర్శకత్వం లో వినాయక్...
- July 28, 2016
టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన వినాయక్ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. మిథునం సినిమాతో తనకంటూ ప్రత్యేకతను చాటిన తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోయే ఓ షార్ట్ఫిలింకు ఈ మాస్ డైరెక్టర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భరణి దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలింకు 'లాస్ట్ ఫార్మర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ షార్ట్ఫిలిం నిర్మిస్తున్న వినాయక్... మంచి కథతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ దొరికితే మరిన్ని వాటిని నిర్మించేందుకు రెడీ అంటున్నాడు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు వినాయక్. ఇదిలాఉంటే.. గతంలో తనికెళ్ల భరణి తెరకెక్కించిన 'సిరా' చిత్రం మంచి పేరును పొంది విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా 'మిథునం' చిత్రం కూడా మంచి గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న షార్ట్ఫిలిం త్వరలో పట్టాలెక్కనుంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







