ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!

- January 23, 2026 , by Maagulf
ట్రంప్ శాంతి మండలిలో చేరిన ఖతార్..!!

దావోస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన శాంతి మండలి చార్టర్ సంతకాల కార్యక్రమంలో ఖతార్ పాల్గొన్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు పలు సభ్య దేశాల నాయకులు, ప్రతినిధుల సమక్షంలో శాంతి మండలిలో ఖతార్ తరపున తార్ ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీ డాక్యుమెంట్ పై సంతకాలు చేశారు. ట్రంప్ ఇచ్చిన పిలుపునకు హాజరైన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రులు శాంతి మండలిలో చేరడానికి తమ దేశాల నాయకుల తరపున సంతకాలు చేశారు. గాజాలో సంఘర్షణను ముగించడానికి రూపొందించిన సమగ్ర ప్రణాళికలో వివరించిన విధంగా మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా ఏర్పడిన మండలి లక్ష్యాలను అమలు చేయడానికి తమ దేశాల తరపున అంగీకారాన్ని తెలియజేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com