రోడ్డున పడేసిన మస్కట్ రోడ్డ్ ప్రమాదం
- July 29, 2016రోడ్డున పడేసిన మస్కట్ రోడ్డ్ ప్రమాదం. సహాయం కోసం కుటుంబీకుల ఎదురుచూపు. స్వదేశంలో పనులు సరిగ్గా దొరకక, పొట్ట చేతపట్టుకొని దూర దేశం వెళితే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో మింగేసింది. కుటుంబ సభ్యులకు కన్నీరే మిగిల్చింది. ఇది బతుకు జీవుడా అంటూ దూరదేశాల్లో పనులు చేసుకునే వారి దుస్థితి. తాజాగా నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం గుండారం గ్రామం ఎల్లాపూర్ తండాకు చెందిన గుగ్లోత్ దూల్యా (32) మస్కట్లో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. బతుకు దెరువు కోసం లక్ష రూపాయలు అప్పుచేసి మస్కట్ దేశానికి వెళ్లాడని, అక్కడ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని చెప్పారు. కంపెనీవారు మూడునెలల జీతం ఇవ్వగా, మరో మూడునెలల జీతం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇంతలోనే రోడ్డు పనులు జరుగుతున్న సమయంలోనే ట్యాంకర్ బోల్తాపడి దూల్యా అక్కడికక్కడే మృతి చెందినట్టు వారన్నారు. అప్పుల పాలైన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే ఆ కుటుంబం దిక్కులేని స్థితిలో ఉండాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే దూల్యా మృతదేహాన్ని స్వదేశానికి తెప్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు. మృతునికిభార్య లక్ష్మి, కుమారుడు సతీష్, కుమార్తెలు స్వాతి, సుజిత ఉన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..