'జెట్ ఎయిర్వేస్' వారి స్పెషల్ ఆఫర్
- July 20, 2015
దేశీయ రూట్లలో.. అక్టోబర్ 15 వరకూ ముంబై: జెట్ ఎయిర్వేస్ సంస్థ దేశీయ రూట్లలో స్పెషల్ చార్జీలను ఆఫర్ చేస్తోంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 15 వరకూ ఈ స్పెషల్ ఆఫర్లు వర్తిస్తాయని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజ్ శివ్కుమార్ చెప్పారు. 750 కిమీ, లోపు దూరమున్న రూట్లలో ఈ స్పెషల్ చార్జీలు రూ.6,999 నుంచి, 750 నుంచి 1,000 కిమీ. దూరమున్న రూట్లలో చార్జీలు రూ.8,999 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. దేశీ నెట్వర్క్లోని తమ అన్ని విమాన సర్వీసులకు ఈ స్పెషల్ చార్జీలు వర్తిస్తాయని వివరించారు. డెరైక్ట్, వయా ఫ్లైట్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. వ్యక్తిగత సర్వీసులతో పాటు మల్టీ-కోర్స్ మీల్ ఆప్షన్లను కూడా అందిస్తున్నామన్నారు. ఇక 1,000 కిమీ. పైబడి దూరమున్న విమాన రూట్లకు సంబంధించిన చార్జీలపై 20% డిస్కౌంట్నిస్తున్నట్లు శివ్కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









