శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

- January 26, 2026 , by Maagulf
శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి

న్యూ ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ(Delhi)లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అతి వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని, దేశానికి విశేష సేవలు అందించిన వీరులకు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు.

అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన వ్యోమగామి, గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు దేశంలో అత్యున్నత శౌర్య పురస్కారమైన ‘అశోక చక్ర’ను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఆయన సాధించిన ఘనత దేశానికి గర్వకారణంగా నిలిచింది. అలాగే భారతదేశ ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్‌ మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఎంపికైన గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు ‘కీర్తి చక్ర’ పురస్కారం అందజేశారు. దేశ అంతరిక్ష రంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com