దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా
- July 29, 2016
మరికొన్ని రోజుల్లో రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జెండా వూపి రియో పరుగు ప్రారంభిస్తారు. రియోకు వెళ్లే క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పేందుకు, చిన్నారులు, యువత, ప్రజల్లో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడమే రియో పరుగు ముఖ్య లక్ష్యం అని మంత్రి గోయల్ అన్నారు.
రియో పరుగులో దాదాపు 20,000 విద్యార్థులు పాల్గొంటారు. మేజర్ ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి పరుగు ప్రారంభమై జవహర్లాల్ నెహ్రూ మైదానం వద్ద ముగుస్తుంది. అలాగే దేశంలోని క్రీడాప్రాధికార కేంద్రాలున్న (శాయ్ సెంటర్స్) సోనేపత్, కోల్కతా, భోపాల్, గాంధీనగర్, తిరువనంతపురంలో పరుగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శాయ్ రూపొందించిన 'ఇండియన్ ఒలింపిక్ జర్నీ' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







