దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా
- July 29, 2016
మరికొన్ని రోజుల్లో రియో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జెండా వూపి రియో పరుగు ప్రారంభిస్తారు. రియోకు వెళ్లే క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పేందుకు, చిన్నారులు, యువత, ప్రజల్లో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడమే రియో పరుగు ముఖ్య లక్ష్యం అని మంత్రి గోయల్ అన్నారు.
రియో పరుగులో దాదాపు 20,000 విద్యార్థులు పాల్గొంటారు. మేజర్ ధ్యాన్చంద్ జాతీయ మైదానం నుంచి పరుగు ప్రారంభమై జవహర్లాల్ నెహ్రూ మైదానం వద్ద ముగుస్తుంది. అలాగే దేశంలోని క్రీడాప్రాధికార కేంద్రాలున్న (శాయ్ సెంటర్స్) సోనేపత్, కోల్కతా, భోపాల్, గాంధీనగర్, తిరువనంతపురంలో పరుగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శాయ్ రూపొందించిన 'ఇండియన్ ఒలింపిక్ జర్నీ' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









