అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటం !
- July 29, 2016
అక్షర మాల ప్రకారం రాష్ట్రం వెనుకబడటంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వివిధ సమావేశాల్లో తమ రాష్ట్రం సమస్యలను వినిపించేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారు. వెస్ట్ బెంగాల్... డబ్ల్యూతో ప్రారంభమవుతుంది కనుక సమావేశాల చివర్లో ఆ రాష్ట్రం తరపున వాదనలు వినిపించవలసి వస్తోందని, అప్పటికి ఇతర రాష్ట్రాల వాదనలు వినే కేంద్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు నీరసించిపోతున్నారని, ఫలితంగా తమకు అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు. అందుకే దీనికి పరిష్కారంగా ఆమె తన రాష్ట్రం పేరును బెంగాల్ అని కానీ, బంగ్లా అని కానీ మార్చాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







