బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- February 03, 2026
యూఏఈ: గత సంవత్సరం జరిగిన ఘోరమైన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రతి టెక్నికల్ సమస్యలను సీరియస్ గా తీసుకుంటుంది. తాజాగా ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లో సమస్య ఉందని ఒక పైలట్ రిపోర్టు చేసిన నేపథ్యంలో సోమవారం తమ బోయింగ్ డ్రీమ్లైనర్లలో ఒకదాన్ని నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది.
విమానాన్ని నిలిపివేసామని, పైలట్ ఆందోళనలను ప్రాధాన్యతా ప్రాతిపదికన నిపుణులతో వెంటనే తనిఖీలు చేయించామని ఎయిర్లైన్ వెల్లడించింది. ఈ విషయాన్ని భారత విమానయాన నియంత్రణ సంస్థకు తెలియజేసినట్లు తెలిపింది.
గత సంవత్సరం రెగ్యులేటర్ నుండి వచ్చిన ఆదేశాల తర్వాత సోమవారం తమ వద్ద ఉన్న బోయింగ్ 787 విమానాలలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను తనిఖీ చేశామని, ఎటువంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది.
గత సంవత్సరం జూన్లో ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ ప్రమాదంలో 260 మంది మరణించినప్పటి నుండి టాటా గ్రూప్ మరియు సింగపూర్ ఎయిర్లైన్స్ యాజమాన్యంలోని క్యారియర్ విమానాల తనిఖీలపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







