శనివారం జేఎన్‌టీయూలో జాబ్‌ మేళా

- July 29, 2016 , by Maagulf
శనివారం జేఎన్‌టీయూలో జాబ్‌ మేళా

కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో (యూఐఐసీ) యూ నివర్సిటీ ఇండస్ర్టీ ఇంటరాక్షన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో శనివారం జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. వర్సిటీలోని అడ్మిన్‌ బ్లాక్‌లోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ లో పలు కంపెనీలు పాల్గొని అభ్యర్థులకు ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటాయి. 40 కంపెనీలు పాల్గొ ని 5 వేల ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయని యూఐఐసీ డైరెక్టర్‌ డాక్ట ర్‌ సీహెచ్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు. బీటెక్‌, బీఫార్మసీ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఏ, బీకాం, బీఎస్సీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌ పూర్తిచేసిన వారు జాబ్‌మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా ఉంటుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com