20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- February 04, 2026
యూఏఈ: బిగ్ టికెట్ అబుదాబి లైవ్ డ్రాలో భారత ప్రవాసుడు 20 మిలియన్ దిర్హమ్లను గెలుచుకున్నారు. ఒమన్ రాజధాని మస్కట్లో రిటైల్ రంగంలో పనిచేస్తున్న భారతీయ ప్రవాసి శాంతలు షిట్టిగర్.. జనవరి 20న టికెట్ నంబర్ 305810ను విజేతగా నిలిచారు. మరొక స్నేహితుడితో కలిసి టికెట్ కొనుగోలు చేసినట్టు, చెరో 10 మిలియన్ దిర్హమ్లు పంచుకోనున్నట్లు షిట్టిగర్ పేర్కొన్నాడు.
1 మిలియన్ దిర్హమ్ల ఐదు కన్సోలేషన్ బహుమతులు కూడా ప్రకటించారు. ఇండియాకు చెందిన జెన్సీ రూబా, దేశన్ కున్షు, సంతోష్ కుమార్ లతోపాటు శ్రీలంకకు చెందిన దులాన్ మయూర, బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ అబు సయ్యద్ తాజా డ్రాలో 1 మిలియన్ దిర్హమ్ల చొప్పున గెలుచుకున్నారు. వీరితోపాటు షార్జాలో నివసిస్తున్న ఒక బంగ్లాదేశీ ప్రవాసి షాహిన్ మియా BMWX5 కారును గెలుచుకున్నాడు.
భారత్ మరియు బంగ్లాదేశ్కు చెందిన నలుగురు ప్రవాసులు బిగ్ విన్ పోటీలో Dh150,000 చొప్పున గెలుచుకున్నారు. విజేతలలో ఒమన్లో నివసిస్తున్న భారతీయ ప్రవాసి కౌశిక్ ఉదేశి, డయానా ప్రిన్సీ ఉన్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









