ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
- February 05, 2026
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్చి 19న నిర్వహించనున్న శ్రీ "పరాభవ" నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులకు 'ఉగాది', 'కళారత్న' పురస్కారాలను ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్.మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
1.సాహిత్యం 2.సంగీతం 3.నృత్యం 4.చిత్రలేఖనం 5. శిల్పం 6.నాటకం 7.జానపదం 8.మిమిక్రీ 9.అవధానం 10.వైద్యం 11.ఇంద్రజాలం & మూకాభినయం 12. హరికథ & బుర్రకథ 13. జర్నలిజం 14.సామాజిక సేవ, 15.కమిటీ సిఫార్సు చేసిన ఇతర సేవారంగాలు వంటి 15 విభాగాల్లో నిష్ణాతులైన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.గతంలో కేంద్ర ప్రభుత్వ అవార్డులు లేదా రాష్ట్ర స్థాయి ఉగాది/కళారత్న పురస్కారాలు పొందిన వారి ధరఖాస్తులు పరిశీలించరన్నారు. ఆసక్తి కల్గినవారు తమ బయోడేటాను ఫిబ్రవరి 20, 2026 లోపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, రెండవ అంతస్ధు ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, దుర్గాపురం, విజయవాడ కార్యాలయానికి పంపించవచ్చునని లేదా [email protected] ఈమెయిల్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో ఆర్.మల్లిఖార్జునరావు తెలియజేశారు.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







