దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!

- February 05, 2026 , by Maagulf
దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!

దోహా: ఖతార్ లో అధికారిక పర్యటన కోసం జర్మనీ ఛాన్సలర్ హెచ్.ఈ. ఫ్రెడరిక్ మెర్జ్ దోహా చేరుకున్నారు. దోహా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఛాన్సలర్ మరియు ఆయనతో పాటు వచ్చిన ప్రతినిధి బృందానికి ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి హెచ్.ఈ. షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థాని మరియు ఖతార్ లోని జర్మనీ రాయబారి హెచ్.ఈ. ఆలివర్ ఓవ్జా స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని తో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతోపాటు పలు రంగాలలో భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలపై సమీక్షిస్తారని అధికార కార్యాలయం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com