తెదేపా ఎంపీలతో భేటీ కానున్నా చంద్రబాబు
- July 30, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం విజయవాడలో తెదేపా ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సమావేశానికి హాజరుకావాలని సీఎం కార్యాలయం నుంచి ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటనపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ..రేపటి సమావేశంలో ప్రత్యేక హోదాపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అవసరం అనుకుంటే రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









