తెదేపా ఎంపీలతో భేటీ కానున్నా చంద్రబాబు
- July 30, 2016
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఉదయం విజయవాడలో తెదేపా ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. సమావేశానికి హాజరుకావాలని సీఎం కార్యాలయం నుంచి ఎంపీలకు సమాచారం అందింది. ప్రత్యేక హోదాపై నిన్న రాజ్యసభలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ చేసిన ప్రకటనపై తెదేపా నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లాలో ఇవాళ రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ..రేపటి సమావేశంలో ప్రత్యేక హోదాపై సీఎంతో చర్చిస్తామని తెలిపారు. అవసరం అనుకుంటే రాజీనామాకైనా సిద్ధమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!
- కువైట్ లో హెల్త్ కేర్ సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్..!!
- మస్కట్ లో ఒమన్ పెర్ఫ్యూమ్ షో ప్రారంభం..!!
- గల్ఫ్ ఐక్యతకు బహ్రెయిన్ – కువైట్ ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు వ్యక్తిత్వాలు నేటి తరానికి ఆదర్శం: డైరెక్టర్ రేలంగి
- సైబర్ నేరగాళ్ల వలలో ఐటీ ఉద్యోగి…
- ఇండియాలోనే రష్యన్ ప్యాసింజర్ విమానాల తయారు
- భారీ వర్షం కారణంగా శ్రీనగర్ విమానాశ్రయంలో అన్ని విమానాలు రద్దు
- అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







