కృష్ణా పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు: డీజీపీ సాంబశివరావు
- July 30, 2016
కృష్ణా పుష్కరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్కింగ్కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, ప్రైవేటు వాహనదారులు ఎక్కడపడితే అక్కడ ఆపితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని ప్రైవేటు వాహనదారులను కోరారు. పుష్కరాలకు వచ్చేవారికి అందుబాటులో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఘాట్ల వద్దకు వాహనాలు వెళ్లవని.. కిలోమీటర్ దూరంలోనే ఆపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సులు, పోలీసుల సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాలకు వచ్చేవారికి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహకారం ఉంటుందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పసిపిల్లలు ఉన్న తల్లులు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్
- తిరుమల శ్రీవారి దర్శన కోటా టికెట్లు విడుదల
- ప్రముఖ ఒడిస్సీ నృత్యకారిణి మధుమిత రౌత్ కన్నుమూత









