కృష్ణా పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు: డీజీపీ సాంబశివరావు
- July 30, 2016
కృష్ణా పుష్కరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్కింగ్కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, ప్రైవేటు వాహనదారులు ఎక్కడపడితే అక్కడ ఆపితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని ప్రైవేటు వాహనదారులను కోరారు. పుష్కరాలకు వచ్చేవారికి అందుబాటులో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఘాట్ల వద్దకు వాహనాలు వెళ్లవని.. కిలోమీటర్ దూరంలోనే ఆపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సులు, పోలీసుల సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాలకు వచ్చేవారికి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహకారం ఉంటుందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పసిపిల్లలు ఉన్న తల్లులు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







