కృష్ణా పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు: డీజీపీ సాంబశివరావు
- July 30, 2016
కృష్ణా పుష్కరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్కింగ్కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, ప్రైవేటు వాహనదారులు ఎక్కడపడితే అక్కడ ఆపితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించవద్దని ప్రైవేటు వాహనదారులను కోరారు. పుష్కరాలకు వచ్చేవారికి అందుబాటులో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఘాట్ల వద్దకు వాహనాలు వెళ్లవని.. కిలోమీటర్ దూరంలోనే ఆపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సులు, పోలీసుల సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాలకు వచ్చేవారికి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహకారం ఉంటుందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పసిపిల్లలు ఉన్న తల్లులు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







