కృష్ణా పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు: డీజీపీ సాంబశివరావు

- July 30, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు:  డీజీపీ సాంబశివరావు

కృష్ణా పుష్కరాలకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్కింగ్‌కు కేటాయించిన ప్రదేశాల్లోనే వాహనాలు నిలపాలని, ప్రైవేటు వాహనదారులు ఎక్కడపడితే అక్కడ ఆపితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని ప్రైవేటు వాహనదారులను కోరారు. పుష్కరాలకు వచ్చేవారికి అందుబాటులో మరిన్ని సిటీ బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఘాట్ల వద్దకు వాహనాలు వెళ్లవని.. కిలోమీటర్‌ దూరంలోనే ఆపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సులు, పోలీసుల సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. పుష్కరాలకు వచ్చేవారికి పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది సహకారం ఉంటుందన్నారు. పుష్కర ఘాట్ల వద్ద పసిపిల్లలు ఉన్న తల్లులు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com