7 నెలలు జీతాల్లేక రోడ్డెక్కిన కార్మికులు
- July 30, 2016
ఏడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వడంలేదని ఆరోపిస్తూ వందలాదిమంది కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలతో నార్తరన్ జెడ్డాలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి, అలాగే ఓ గ్యాస్ స్టేషన్ మూసివేయాల్సి వచ్చింది. పరిస్థితిని సమీక్షిస్తున్నామనీ, తమ పరిధిలో ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నామని మక్కా రీజియన్ పోలీస్ అధికార ప్రతినిథి కల్నల్ అత్తి అల్ ఖురాషి చెప్పారు. మినిస్ట్రీ అధికార ప్రతినిథి ఖలెద్ అబా అల్ ఖలీల్ మాట్లాడుతూ, జీతాలు చెల్లించకపోవడంతో సమస్య ఏర్పడిందనీ, పరిస్థితిని చక్కదిద్దడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని వివరించారు. ఇప్పటికే ఆ సంస్థకు పలుమార్లు నోటీసులు అందించామని, వేజ్ ప్రొటెక్షన్ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందిగా కంపెనీపై ఒత్తిడి తీసుకొస్తున్నామని అన్నారు. నిబంధనల్ని అతిక్రమించినందుకుగాను ఆ సంస్థలపై ఫైన్ మరియు పెనాల్టీ విధించడం జరుగుతుందని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









