ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- February 11, 2026
మస్కట్: ఒమానీ న్యాయవాదుల సంఘం తన మానవతావాద చొరవ "ఫక్ కుర్బా" 13వ ఎడిషన్ను ప్రారంభించింది. ఇది నాన్ క్రిమినల్ కేసుల్లో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారికి మద్దతు ఇస్తుంది. ఒమానీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ చైర్మన్ అబ్దుల్ సలాం బిన్ మొహమ్మద్ అల్ ముర్షిది ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
ఒమానీ న్యాయవాదుల సంఘం చైర్మన్ డాక్టర్ హమద్ బిన్ హమ్దాన్ అల్ రుబాయ్ మాట్లాడుతూ.. ఈ చొరవ మానవతావాద మరియు సోషల్ వర్క్ లో ప్రముఖ జాతీయ మోడల్ ను సూచిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ పన్నెండవ ఎడిషన్ ఫలితాలను సమీక్షించింది. ఒమన్ సుల్తానేట్ అంతటా నాన్ క్రిమినల్ కాని ఆర్థిక కేసులలో 1,088 మంది వ్యక్తులు విడుదలయ్యారు. ఆర్థిక పరమైన, పౌర, కార్మిక లేదా షరియా కేసులలో మాత్రమే జైలుశిక్షను అనుభవిస్తున్న లేదా వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయి ఉండాలి. క్లెయిమ్ మొత్తం OMR 2,000 మించకూడదు. వ్యక్తి దాని మునుపటి ఎడిషన్లలో ఈ చొరవ కింద ప్రయోజనం పొంది ఉండకూడదు. చిన్న క్లెయిమ్లకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తరువాత పెద్ద క్లెయిమ్లు, ఆపై అత్యంత పురాతనమైన కేసులకు ప్రాధాన్యత ఇస్తారు. 2012లో "ఫక్ కుర్బా" చొరవను ప్రారంభించినప్పటి నుంచి 8,198 మందికి పైగా వ్యక్తులను విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు
- జీసీసీ కీలక కస్టమ్స్ అథారిటీ సమావేశం..కీలక సమీక్షలు..!!
- సౌదీలో 40శాతం తగ్గిన క్రోనిక్ డిసీజ్ డెత్స్..!!
- ప్రపంచంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయంగా DXB..!!
- ట్రాఫిక్ అలెర్ట్..అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- ఫక్ కుర్బా కింద 8వేల మందికి పైగా విడుదల..!!
- బహ్రెయిన్లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్..!!
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది









