యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!

- February 15, 2026 , by Maagulf
యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!

యూఏఈ: ఓ గల్ఫ్ జాతీయుడిని 2.4 మిలియన్ల దిర్హామ్‌ల మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులకు అప్పీలేట్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, వారు అంతకుముందు దిగువ కోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. అనంతరం తీర్పుపై అప్పీల్ చేయడంతో.. తాజాగా వారిని కోర్టు నిందితులుగా పేర్కొంటూ.. శిక్ష విధించింది.   

కేసు రికార్డుల ప్రకారం.. ఎమిరేట్ లోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలు ఉన్నాయని, పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని విక్టిమ్ ను మోసం చేశారు. వారి మాటలు నమ్మి  Dh2.4 మిలియన్లను వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేసి మోసపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com