ఎ.ఆర్. రెహమాన్కు అరుదైన గౌరవం
- July 30, 2016
ప్ర ముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్కు అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చే నెల 15న ఐక్యరాజ్యసమితి వేదికపై తన సంగీతం, గానంతో సమ్మోహితుల్ని చేయనున్నారు. ఇప్పటి వరకు ప్రముఖ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆమె 1966లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓ కార్యక్రమంలో తన గానమాధుర్యాన్ని వినిపించారు. ఇప్పుడు రెహమాన్కు ఆ అవకాశం దక్కింది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు రెహమాన్ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. ఇందులో రెహమన్ 'దిల్సే' పాటల నుంచి తాజా 'సరసరియా...'వరకు అద్భుతమైన పాటలతో అలరించనున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 'వేర్ ది మైండ్ ఈజ్ విత్ అవుట్ ఫియర్'ను సరికొత్తగా ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







