జమ్మూకశ్మీర్ లో ఆగస్ట్ 5 వరకు బంద్..

- July 30, 2016 , by Maagulf
జమ్మూకశ్మీర్ లో ఆగస్ట్ 5 వరకు బంద్..

జమ్మూకశ్మీర్ లో వేర్పాటువాదులు తమ ఆందోళనను పొడిగించారు. ఆగస్ట్ 5 వరకు బంద్ కొనసాగతుతుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించారు. పుల్వామా, కుల్గాం, షోపియాన్ లతో పాటు కశ్మీర్ వ్యాలీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని సీనియర్ పోలీస్ అధికారి ఆదివారం వెల్లడించారు. శ్రీనగర్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో సైతం ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.భద్రతా బలగాలు శాంతిభద్రతల అంశంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. తీవ్రమైన హింస, ప్రజాధనాన్ని ధ్వసం చేసే చర్యలను అడ్డుకోవడానికే ఆంక్షలను పొడిగిస్తున్నట్లు వారు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com