ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!

- February 18, 2026 , by Maagulf
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!

మస్కట్: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX 164లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఫ్లైట్ లో 125 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 11.30 గంటలకు మస్కట్ (MCT) నుండి న్యూఢిల్లీ (DEL)కి బయలుదేరాలి. కానీ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నడిపే AI-9234 ఫ్లైట్ "టెక్నికల్ ఇష్యూస్" కారణంగా దాదాపు 5గంటల ఆలస్యంగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరింది.    

అయితే, న్యూఢిల్లీ నుండి తమ కనెక్టింగ్ విమానాలను మిస్ కావడం పట్ల చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టిక్కెట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం, ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణాల వల్ల కలిగే ఆర్థిక నష్టం గురించి ఆందోళన చెందారు.       

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com