గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- February 18, 2026
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో “సింగిల్ ట్రావెల్ పాయింట్” (STP) ఎయిర్ సిస్టమ్ మొదటి దశను బహ్రెయిన్, యూఏఈ అధికారికంగా ప్రారంభించాయి. దీనిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సెక్రటేరియట్ జనరల్ సహకారంతో నిర్వహించనున్నారు. నవంబర్ 12న కువైట్లో జరిగిన 42వ సమావేశంలో GCC సభ్య దేశాల అంతర్గత మంత్రుల నిర్ణయం ప్రకారం ఈ సింగిల్ ట్రావెల్ పాయింట్ ను ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్-ఫాదేల్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఆఫ్ యూఏఈ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్-ఖైలీ మరియు GCC సెక్రటరీ జనరల్ జాసిమ్ మొహమ్మద్ అల్-బుదైవి పాల్గొన్నారు.
STP ఎయిర్ సిస్టమ్ ప్రారంభం బహ్రెయిన్ మరియు దాని GCC సోదర దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుందని, ఇంటిగ్రేటెడ్ గల్ఫ్ ట్రావెల్ నెట్వర్క్ వైపు ఒక వ్యూహాత్మక అడుగును సూచిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ అల్-ఫాదేల్ తెలిపారు. ఇది ప్రయాణికుల ఎగ్జిట్ కీలకమైన విధానాలను పూర్తి చేయడానికి, రవాణాను వేగవంతం చేయడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి మరియు సరిహద్దుల్లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి వీలు కల్పిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









