గల్ఫ్ లో తొలి సింగిల్ ట్రావెల్ పాయింట్ ప్రారంభం..!!
- February 18, 2026
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో “సింగిల్ ట్రావెల్ పాయింట్” (STP) ఎయిర్ సిస్టమ్ మొదటి దశను బహ్రెయిన్, యూఏఈ అధికారికంగా ప్రారంభించాయి. దీనిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) సెక్రటేరియట్ జనరల్ సహకారంతో నిర్వహించనున్నారు. నవంబర్ 12న కువైట్లో జరిగిన 42వ సమావేశంలో GCC సభ్య దేశాల అంతర్గత మంత్రుల నిర్ణయం ప్రకారం ఈ సింగిల్ ట్రావెల్ పాయింట్ ను ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల డిప్యూటీ మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అడెల్ బిన్ ఖలీఫా అల్-ఫాదేల్, ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు పోర్ట్ సెక్యూరిటీ ఆఫ్ యూఏఈ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ సుహైల్ సయీద్ అల్-ఖైలీ మరియు GCC సెక్రటరీ జనరల్ జాసిమ్ మొహమ్మద్ అల్-బుదైవి పాల్గొన్నారు.
STP ఎయిర్ సిస్టమ్ ప్రారంభం బహ్రెయిన్ మరియు దాని GCC సోదర దేశాల మధ్య బలమైన సంబంధాలను ప్రతిబింబిస్తుందని, ఇంటిగ్రేటెడ్ గల్ఫ్ ట్రావెల్ నెట్వర్క్ వైపు ఒక వ్యూహాత్మక అడుగును సూచిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ అల్-ఫాదేల్ తెలిపారు. ఇది ప్రయాణికుల ఎగ్జిట్ కీలకమైన విధానాలను పూర్తి చేయడానికి, రవాణాను వేగవంతం చేయడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి మరియు సరిహద్దుల్లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి వీలు కల్పిస్తుందని లెఫ్టినెంట్ జనరల్ వివరించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









