ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- February 18, 2026
మస్కట్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX 164లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఫ్లైట్ లో 125 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 11.30 గంటలకు మస్కట్ (MCT) నుండి న్యూఢిల్లీ (DEL)కి బయలుదేరాలి. కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడిపే AI-9234 ఫ్లైట్ "టెక్నికల్ ఇష్యూస్" కారణంగా దాదాపు 5గంటల ఆలస్యంగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరింది.
అయితే, న్యూఢిల్లీ నుండి తమ కనెక్టింగ్ విమానాలను మిస్ కావడం పట్ల చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టిక్కెట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం, ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణాల వల్ల కలిగే ఆర్థిక నష్టం గురించి ఆందోళన చెందారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









