ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం..మస్కట్ లో ప్రయాణికుల పాట్లు..!!
- February 18, 2026
మస్కట్: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం IX 164లో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి న్యూఢిల్లీకి దాదాపు 5 గంటల ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఫ్లైట్ లో 125 మందికి పైగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి 11.30 గంటలకు మస్కట్ (MCT) నుండి న్యూఢిల్లీ (DEL)కి బయలుదేరాలి. కానీ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ నడిపే AI-9234 ఫ్లైట్ "టెక్నికల్ ఇష్యూస్" కారణంగా దాదాపు 5గంటల ఆలస్యంగా మరుసటి రోజు తెల్లవారుజామున 3.50 గంటలకు బయలుదేరింది.
అయితే, న్యూఢిల్లీ నుండి తమ కనెక్టింగ్ విమానాలను మిస్ కావడం పట్ల చాలా మంది ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో టిక్కెట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండటం, ముందస్తుగా బుక్ చేసుకున్న ప్రయాణాల వల్ల కలిగే ఆర్థిక నష్టం గురించి ఆందోళన చెందారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









