సౌదీలో అలమటిస్తున్న 800 మంది భారతీయులు సహాయక చర్యలకు ఆదేశించిన సుష్మ

- July 31, 2016 , by Maagulf
సౌదీలో అలమటిస్తున్న 800 మంది భారతీయులు సహాయక చర్యలకు ఆదేశించిన సుష్మ

 న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో 10,000 మందికిపైగా భారత కార్మికులు "ఆహార సంక్షోభం" ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ శనివారం చెప్పారు. ఉపాధి కోసం సౌదీలో జెడ్డాకు వెళ్లిన దాదాపు 800 మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి మూడు రోజులుగా ఆకలితో అలమటిస్తున్నారు. ట్విటర్‌ ద్వారా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఒక వ్యక్తి తెలపడంతో ఆమె వెంటనే స్పందించారు. వారికి ఆహారం, ఇతర సహాయ సహకారాలు అందించాల్సిందిగా సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. సౌదీ అరేబియా, కువైట్‌లలో భారతీయులు ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్నారు. సహాయ మంత్రి ఎంజే అక్బర్‌ ఆయా దేశాల అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షిస్తారని, మరో మంత్రి వీకే సింగ్‌ సౌదీకి వెళతారని సుష్మా వెల్లడించారు. ఆయా దేశాల్లో పరిశ్రమలను మూసివేయడంతో పాటు యజమానులు జీతాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు అందిస్తున్న ఆహార పదార్థాల చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com