పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది...

- July 31, 2016 , by Maagulf
పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది...

ముంబయిలోని ప్రముఖ బిస్కెట్‌ కంపెనీ పార్లేజీ ఫ్యాక్టరీ మూతపడింది. 1929లో ముంబయిలోని వీల్‌ పార్లే ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీని నిర్మించారు. గత 87 ఏళ్లుగా ఉత్పత్తులు తయారుచేస్తోంది. వీల్‌ పార్లే ప్రాంతంలో స్థాపించారు కాబట్టి దీని పేరు పార్లే అని పెట్టారు. దాంతో ముంబయిలో ఈ ఫ్యాక్టరీ బాగా ప్రసిద్ధిచెందింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ ఉత్పాదకత కారణంగా యాజమాన్యం ఫ్యాక్టరీని మూసేసింది. అయితే పార్లేజీకి దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. రాజస్థాన్‌, గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణాల్లోని ఫ్యాక్టరీల నుంచి తయారయ్యే వివిధ రకాల ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com