యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తం : మోదీ
- July 31, 2016
మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పలు అంశాలపై ప్రజలతో ముచ్చటించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలను సాకారం చేయాలంటే శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. నిత్యజీవితంలో ఉపయోగపడే విదంగా సాంకేతికాభివృద్ధి ఉండాలని సూచించారు. ప్రభుత్వం 'అటల్ ఇన్నొవేషన్ మిషన్' కార్యక్రమం ద్వారా సాంకేతిక రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందన్నారు.రైతులు కలపనిచ్చే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. దీని ద్వారా కలపను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదని తెలిపారు. అలాగే, దేశప్రజలు యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్లు సూచించకుండా యాంటీ బయాటిక్స్ వాడొద్దని అన్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









