యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తం : మోదీ
- July 31, 2016
మన్ కీ బాత్ రేడియో కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం పలు అంశాలపై ప్రజలతో ముచ్చటించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కలలను సాకారం చేయాలంటే శాస్త్రసాంకేతిక రంగాలలో అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. నిత్యజీవితంలో ఉపయోగపడే విదంగా సాంకేతికాభివృద్ధి ఉండాలని సూచించారు. ప్రభుత్వం 'అటల్ ఇన్నొవేషన్ మిషన్' కార్యక్రమం ద్వారా సాంకేతిక రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తుందన్నారు.రైతులు కలపనిచ్చే మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని మోదీ సూచించారు. దీని ద్వారా కలపను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం ఉండదని తెలిపారు. అలాగే, దేశప్రజలు యాంటీ బయాటిక్ మందుల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డాక్టర్లు సూచించకుండా యాంటీ బయాటిక్స్ వాడొద్దని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







