అదనపు ఛార్జీలపై ఇండియన్ ఎంబసీ క్లారిటీ..!!
- February 23, 2026
మస్కట్: ఒమన్లోని అన్ని భారతీయ కాన్సులర్, పాస్పోర్ట్ మరియు వీసా సేవలకు దరఖాస్తుకు OMR 6 ఫిక్సుడ్ ఛార్జీలు వర్తిస్తాయని, ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని మస్కట్లోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు గైడ్ లైన్స్ ను జారీ చేసింది.
సుల్తానేట్లోని భారత కాన్సులర్, పాస్పోర్ట్ మరియు వీసా సేవలకు SGIVS గ్లోబల్ సర్వీసెస్ (SGIVS) ఏకైక ఆథరైజ్ సర్వీస్ ప్రొవైడర్ అని రాయబార కార్యాలయం తెలిపింది. రాయబార కార్యాలయం తరపున దరఖాస్తులను స్వీకరించడానికి మరే ఇతర ఏజెన్సీ లేదా సంస్థకు అనుమతి లేదని పేర్కొంది.
ఒమన్ వ్యాప్తంగా 11 దరఖాస్తు కేంద్రాలను నిర్వహిస్తున్న SGIVS, దాని ఏ కేంద్రాలలోనైనా సమర్పించిన ప్రతి దరఖాస్తును స్వీకరిస్తుందని వెల్లడించారు. ఇక పాస్పోర్ట్ దరఖాస్తుదారులు ఫోటోలను తీసుకురావాల్సిన అవసరం లేదని రాయబార కార్యాలయం తెలిపింది. SGIVS ప్రతి దరఖాస్తు కు సంబంధించి కేంద్రాలలోనే ఫోటోలను నేరుగా తీసుకుంటారని వెల్లడించారు. మరింత సమాచారం లేదా ఫిర్యాదులను [email protected] కు మెయిల్ చేయవచ్చని ఇండియన్ ఎంబసీ సూచించింది.
తాజా వార్తలు
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!









